స్టార్ హీరోయిన్ నయనతార షూటింగ్లకు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ చిత్ర సెట్స్లో తాజాగా అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణకు నయనతార హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్న నయనతార థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లింది. హనీమూన్ ముగించుకుని ‘జవాన్’ సెట్లో అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న విడుదల చేయబోతున్నారు.