మహేశ్ బాబు కొత్త సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా అనుకున్నా…చిత్రీకరణ ఆలస్యమవుతూ రావడం వల్ల ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.