SS Rajamouli | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) నటిస్తున్న తాజా చిత్రం గుంటూరుకారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28గా వస్తోన్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు మరోవైపు ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29)తో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేసినట్టు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
కాగా తాజాగా మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి త్వరలోనే ముంబైకి పయనం కానున్నాడట. తాజా టాక్ ప్రకారం ముంబైలో పలువురు హిందీ యాక్టర్లను కలవబోతున్నాడని ఓ వార్త మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న ఈ చిత్రంలో వరల్డ్వైడ్గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇదే నిజమైతే జక్కన్న నుంచి మరో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ రావడం పక్కా అయిపోయినట్టేనంటున్నారు సినీ జనాలు.
ఎస్ఎస్ఎంబీ 29 కోసం భారీ సెట్లో షూటింగ్కు ప్లాన్ చేస్తుండగా.. ఈ షూట్ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్టు వేసే ప్లాన్లో ఉన్నారని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ సెట్లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుగనుందని తెలుస్తోండగా.. మిగిలిన భాగాన్ని ఆఫ్రికా, యూరప్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో మహేశ్ బాబు రోల్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో లార్డ్ హనుమాన్ స్ఫూర్తిగా సాగనుందని వార్తలు హల్ చల్ చేస్తుండగా.. దీనిపై జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అమెజాన్ ఫారెస్ట్లో వచ్చే అడ్వెంచరస్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్గా నిలువబోతుందని టాక్.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
As of now only @ssrajamouli’s #SSMB29 has potential to drag international audience to watch telugu movies in theatres – @Shobu_ ❤️🔥
MOST ANTICIPATED FILM OF INDIAN CINEMA 😎 pic.twitter.com/TqnxIurIEM
— VardhanDHFM (@_VardhanDHFM_) November 26, 2023