Sriya Reddy | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు శ్రియారెడ్డి (Sriya Reddy). ఈ చెన్నై సుందరి అప్పుడప్పుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఆ తర్వాత అమ్మ చెప్పింది సినిమాలో మెరిసింది. గతేడాది సలార్ పార్టు 1 (Salaar )తో థియేటర్లలో సందడి చేసిన ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఓజీ (OG)లో కీలక పాత్రలో నటిస్తుంది. సలార్లో శ్రియా రెడ్డి పోషించిన రాధా రమా మన్నార్ పాత్రకు మంచి స్పందన వచ్చింది.
కాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ ప్లాన్స్ గురించి చెప్పింది. ఈ రోజుల్లో హిందీ, దక్షిణాది సినిమాలంటూ బేధం ఏమీ లేదని, సరైన పాత్ర దొరికినప్పుడు మాత్రమే హిందీ సినిమా చేస్తానంది. దక్షిణాది సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలనే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. చాలా కాలం తర్వాత సలార్తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన శ్రియా రెడ్డి మరి రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
శ్రియారెడ్డి ఓజీ గురించి మాట్లాడుతూ.. సుజిత్ ప్రేక్షకుల కోసం ఏం రెడీ చేస్తున్నాడో.. ఓజీ ప్రపంచంలో ఎలాంటి బలమైన పాత్రలను సృష్టిస్తున్నాడో మీరస్సలు ఊహించలేరు. ఓజీలో వచ్చే ఓ ప్రత్యేకమైన సీన్ మీ మైండ్ బ్లాంక్ అవడం గ్యారంటీ. సుజిత్ ఓజీ చిత్రంలో 50 శాతం యాక్షన్, 50 శాతం ఎమోషన్స్ ఉండేలా పాత్రలను డిజైన్ చేశాడంటూ చేసిన కామెంట్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.