సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు. కాగా.. కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోని కందులపాలెంటో జరగనున్నట్లు బంధువులు పేర్కొంటున్నారు.
కాగా శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం పలకరించలేదు.