Sree Vishnu | ‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా సినిమా విశేషాలను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వెల్లడించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సందీప్ గుణ్ణం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఓ వినూత్నమైన పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, శ్రీవిష్ణు పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.
‘ఇప్పటికే ఈ సినిమా అరవైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పరిశోధనాత్మక థ్రిల్లర్ జోనర్లో విభిన్న కథాంశమిది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్, సంగీతం: కాలభైరవ, ఎడిటర్: శ్రీకర్ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఏ దత్, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్.