Sreeleela | అరంగేట్రం చేసిన అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. అవన్నీ అగ్ర హీరోల చిత్రాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీలీల ‘పుష్ప-2’ చిత్రంలో ఐటెంసాంగ్లో నర్తించనుందని వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ చిత్రంలో సమంత చేసిన ‘ఊ అంటవా’ ప్రత్యేక గీతం బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో సీక్వెల్లో కూడా మాస్ ఐటెంసాంగ్ను పెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది.
శ్రీలీలకు నృత్యాల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామ అయితే స్పెషల్సాంగ్కు న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.