కెరీర్పరంగా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి స్టార్డమ్తో దూసుకుపోతున్నది అచ్చ తెలుగందం శ్రీలీల. చూడముచ్చటైన రూపం, చలాకీ అభినయంతో యువతరంలో ఈ భామ తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో గ్లామర్ ప్రధాన పాత్రల్లోనే కనిపించడంతో నటిగా ఆమె పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంలేదన్నది అభిమానుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో కెరీర్లోనే తొలిసారి ఈ ముద్దుగుమ్మ మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్నగర్ టాక్.
వివరాల్లోకి వెళితే..దర్శకనిర్మాత వేణు ఊడుగుల 1994 మద్యపాన నిషేధం నేపథ్యంలో ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీబోర్సే, సాయిపల్లవి పేర్లు వినిపించాయి. వరుస సినిమాలతో వారిద్దరూ బిజీగా ఉండటంతో మేకర్స్ మరో నాయిక అన్వేషణలో పడ్డారని, చివరకు శ్రీలీలను ఖరారు చేశారని సమాచారం. ఈ పీరియాడిక్ చిత్రానికి ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి రమేష్ ఎలిగేటి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.