సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో కలిసిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ యూ ట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
పిల్లలు పెద్దలు అంతా కలిసి చూడదగ్గ సినిమా అంటూ.. U/A సర్టిఫికేట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు డైలాగులు కూడా కాస్త శృతి మించడంతో క్లీన్ యు సర్టిఫికేట్ కు దూరం అయింది శ్రీదేవి సోడా సెంటర్ సినిమా.
ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ భారీగా విడుదలవుతుంది. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తున్నది. జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.