Mirzapur The Film | ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ తాజాగా బంఫర్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా ఎంపికైనట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీ ప్రయాణంలో భాగమవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. నన్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన దర్శకుడు గుర్మీత్ సింగ్, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సోనాల్ రాసుకోచ్చింది.
మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడు సీజన్లను కలిపి సినిమాగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు), శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ తదితరులు మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్నారు. కొత్తగా జితేంద్ర కుమార్ (పంచాయత్ ఫేమ్), రవి కిషన్, సోనాల్ చౌహాన్ ఇందులో భాగమయ్యారు.