రణధీర్, నందినిరెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఎమ్.వినయ్బాబు దర్శకుడు. బీసు చందర్గౌడ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిది. హృద్యమైన ప్రణయభావనలకు అద్దం పడుతుంది. యువతతో పాటు తల్లిదండ్రులకు సందేశం ఉంటుంది’ అన్నారు. ‘శనివారంతో షూటింగ్ పూర్తవుతుంది. భద్రాచలం, చిక్మంగ్ళూర్, బెంగళూరు, హైదరాబాద్లో చిత్రీకరణ జరిపాం. అనేక మలుపులతో కథ ఆసక్తిని పంచుతుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని నిర్మాత చెప్పారు. సుమన్, సూర్య, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కుమార్, సంగీతం: ఎస్.ఎస్.నివాస్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: ఎమ్.వినయ్బాబు.