కోల్కతా : ప్రముఖ గాయని సంధ్యా ముఖోపాధ్యాయ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డారని, ఆ తర్వాత ఆమెను దక్షిణ కోల్కతాలోని తన నివాసం నుంచి ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆసుపత్రికి తరలించే మార్గంలో ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఉండేందుకు పోలీసులు గ్రీన్కారిడార్ ఏర్పాటు చేశారు. సంధ్యా ముఖోపాధ్యాయ మంగళవారం సాయంత్రం బాత్రూంలో జారిపడ్డారని, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆమె రెండు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు తెలిసింది. ఆ తర్వాత జ్వరం కూడా రావడంతో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వుడ్బర్న్ బ్లాక్లో చికిత్స పొందుతుండగా.. ఎస్ఎస్కేఎం ఆసుపత్రి ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న ఆమెకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించగా.. తిరస్కరించారు. సంధ్యా ముఖోపాధ్యాయ అనేక బెంగాళీ, హిందీ చిత్రాల్లో పాటలు పాడారు. ఎస్డీ బర్మన్, మదన్ మోహన్, నౌషాద్, అనిల్ బిస్వాస్, సలీల్ చౌదరి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పని చేశారు.