ముంబై : ప్రఖ్యాత గాయని, భారత రత్న లతా మంగేష్కర్.. ఇంకా ఐసీయూ వార్డులో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కరోనా వైరస్ సంక్రమించిన లతా మంగేష్కర్ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్లో ఉండనున్నట్లు డాక్టర్ ప్రతీత్ సామ్ధాని తెలిపారు. కోవిడ్తో పాటు ఆమె న్యూమోనియా నుంచి బాధపడుతున్నట్లు డాక్టర్ వెల్లడించారు. మంగేష్కర్కు కరోనా సోకినట్లు ఆమె మేనకోడలు రచనా షా మంగళవారం తెలిపారు.