Simbu | వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు తమిళ హీరో శింబు. త్వరలో ఆయన తన 48వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. రాజ్కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పెరియస్వామి దర్శకుడు. సెప్టెంబర్లో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది.
తాజా సమాచారం ప్రకారం హిస్టారికల్ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కింబోతున్నారని..ఇందులో శింబు హీరోగా, విలన్గా రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. కమల్హాసన్ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. శింబు కెరీర్లోనే భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారు.