బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం మిషన్ మజ్ను (Mission Majnu). ఇవాళ మేకర్స్ మిషన్ మజ్ను ట్రైలర్ను విడుదల చేశారు. 1971 ఇండో-పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్లో జరిగిన ఇండియా కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శాంతను బాగ్చి డైరెక్ట్ చేస్తున్నాడు.
పాకిస్థాన్ అక్రమంగా న్యూక్లియర్ బాంబు తయారు చేస్తోంది. మనం ఖచ్చితంగా వారి న్యూక్లియర్ బాంబును నిర్వీర్యం చేయాలంటూ సాగుతున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. మనకు ఆయుధాలు అవసరం లేదు. దీన్ని ఆపే జ్ఞానం కావాలని ఉన్నతాధికారి అంటుండగా.. ఈ పని చేసే ఏజెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు.
సిద్ధార్థ్ మల్హోత్రా స్పై ఏజెంట్గా పాకిస్థాన్కు ఎంట్రీ ఇవ్వడం, మధ్యలో రష్మిక మందన్నాతో వివాహం, ఆ తర్వాత ఆపరేషన్ ఎలా సాగిందనే విషయాలను సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మిషన్ మజ్ను డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అవనుంది. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది.
మిషన్ మజ్ను ట్రైలర్..
Jo khud se pehle desh ke baare mein soche, wahi hain #DeshKeLiyeMajnu 🇮🇳
Watch Mission Majnu, a spy thriller inspired by true events.
Arrives on 20th January, only on Netflix. pic.twitter.com/s5tNdW5cuv— Netflix India (@NetflixIndia) January 9, 2023