బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ-హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం మంగళవారం రాత్రి రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘షేర్షా’ చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కియారా అద్వాణీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.
మరిన్ని ఫొటోలకు: Kiara Advani | కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలు.. వైరల్