వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ముంబైలో తమ పెండ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిశారు. నాయికలు కాజోల్, కృతి సనన్, అనన్య పాండే, భూమి ఫెడ్నేకర్, రకుల్ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, కరీనా కపూర్, ఆలియా భట్, విద్యాబాలన్, దర్శకుడు కరణ్ జోహార్, హీరోలు ఆదిత్యరాయ్ కపూర్, వరుణ్ ధావన్, రన్వీర్ సింగ్, వికీ కౌశల్, ఆయుశ్మాన్ ఖురానా, అభిషేక్ బచ్చన్ తదితురులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7న రాజస్థాన్లో కియారా, సిద్ధార్థ్ పెండ్లి వేడుక జరిగింది.