‘డీజే టిల్లు’ చిత్రంతో యువతరానికి బాగా చేరువయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్వేర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది.
కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలబోసి తనదైన శైలి కథాంశంతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని..సిద్ధు జొన్నలగడ్డ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.