‘డీజే టిల్లు’ఫేం సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రధారులుగా రూపొందనున్న చిత్రానికి ‘తెలుసుకదా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
పీపుల్ ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించనున్న 30వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం విడుదల చేశారు. నీరజ కోన మాట్లాడుతూ ‘ఇది పూర్తి విందుభోజనం లాంటి సినిమా. సామాజికాంశాలు, అనుబంధాల నేపథ్యంలోసాగే కథ ఇది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీ తం: ఎస్.థమన్.