బాలీవుడ్లో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాడు యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. తాజాగా ఆయన మరో భారీ యాక్షన్ సినిమాలో భాగం కానున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘రౌడీ రాథోడ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమాకు సీక్వెల్ను రూపొందించే పనిలో ఉన్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సీక్వెల్లో సిద్థార్థ్ మల్హోత్రా నటించనున్నారు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం అక్షయ్కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు యాక్షన్ హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాకు వస్తున్న పేరు దృష్ట్యా ఆయన్ని ఈ సీక్వెల్లో హీరోగా ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.