BBTeluguGrandFinale | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే అంగరంగవైభవంగా నడుస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్లలో ముందుగా సిరి ఎలిమినేట్ అయింది. పుష్ప టీమ్ వచ్చి సిరిని ఎలిమినేట్ చేసింది.
తాజాగా.. శ్యామ్ సింగరాయ్ టీమ్ బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేసింది. నాచురల్ స్టార్ నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి.. స్టేజ్ మీద అలరించారు. అయితే.. బిగ్ బాస్ 2 సీజన్కు నాని హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ 3 సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మళ్లీ బిగ్ బాస్ స్టేజ్ ఎక్కలేదు. తాజాగా.. తన లేటెస్ట్ మూవీ శ్యామ్సింగరాయ్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ ఫినాలేకు వచ్చాడు. అయితే.. కొంతసేపు బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలేకు హోస్ట్గా వ్యవహరించాడు నాని.
ఫైనల్ ఫోర్లో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఒక గేమ్ ప్లే చేశారు. ఇద్దరు హీరోయిన్లు కృతి, సాయి పల్లవి ఇద్దరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఆ తర్వాత నానిని కూడా ఓ పెట్టెతో పాటు పంపిస్తారు. నలుగురిలో ఒకరిని బయటికి పంపించేందుకు నాని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు.