Shruti Haasan | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ బారినపడ్డట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చూస్తున్నా.. మిమ్మిల్ని త్వరలోనే మళ్లీ కలుస్తా ఇస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంతో పాటు బాలయ్య 107వ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘బెస్ట్ సెల్లర్’ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె తండ్రి కమల్ హాసన్ సైతం కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.