గత రెండేళ్లుగా తమిళ సోయగం శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోతుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ఇటీవలే విడుదలైన ‘సలార్-1’ చిత్రంతో మూడు భారీ సక్సెస్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే తెలుగులో తన కెరీర్ను ‘గబ్బర్సింగ్’ మలుపుతిప్పిందని..అక్కడి నుంచి భారీ విజయాలు దక్కడం మొదలైందని చెప్పింది శృతిహాసన్.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ “గబ్బర్సింగ్’కు ముందు నా కెరీర్ వేరుగా ఉండేది. ఆ సినిమా నా కెరీర్కు టర్నింగ్ పాయింట్ నిచ్చింది. కెరీర్లో తిరుగులేని కమర్షియల్ విజయాన్ని అందించింది. ఓ రకంగా ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. అంతకుముందు కూడా నేను చాలా హార్డ్వర్క్ చేశాను. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ‘గబ్బర్సింగ్’ తర్వాతే నా కెరీర్ ట్రాక్లో పడింది’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఎప్పుడో పదకొండేండ్ల క్రితం విడుదలైన ‘గబ్బర్సింగ్’ సినిమా గురించి శృతిహాసన్ ఇప్పుడు మాట్లాడటం విశేషం.