Shruti Haasan | టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా పేరు పొందిన నటి శృతిహాసన్. టాలీవుడ్ పలువురు స్టార్ హీరోలకు కంబ్యాక్ ఇచ్చిన సినిమాలలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. దాంతో ఈమెను గోల్డెన్ లెగ్గా అంటూ పిలుస్తున్నారు. ‘కాటమరాయుడు’ తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకుని ‘క్రాక్’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వరుసగా ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమాతో పాటు బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో నటిస్తుంది. తాజాగా మెగాస్టార్-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా ఎంపికయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి శృతి హాసన్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించడానికి 2 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. బాలకృష్ణ సినిమాలో నటిచండానికి ఈమె కోటిన్నర వరకు తీసుకుందట. కానీ చిరంజీవితో నటించడానికి మాత్రం 2కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం సీనియర్ హీరోలతో నటించడాని హీరోయిన్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో శృతి హాసన్ సినీయర్ హీరోలతో నటించడానికి ఒప్పుకుంటుంది. దాంతో నిర్మాతలు కూడా తను డిమాండ్ చేసింది ఇవ్వక తప్పదు. సినిమాల్లోనే కాకుండా శృతిహాసన్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది.