‘సై’, ‘మగధీర’, ‘శ్రీమంతుడు’తో పాటు పలు సినిమాల్లో విలన్గా, సహాయనటుడిగా కనిపించి మెప్పించారు శ్రవణ్ రాఘవేంద్ర. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘ఎదురీత’. బాలమురుగన్ దర్శకుడు. బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మాతలు. లియోనా లిషోయ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. నలభై ఏళ్ల మధ్యతరగతి తండ్రికి తన కొడుకుపై ఉన్న ప్రేమ ఎలాంటి సమస్యల్ని తీసుకొచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలోని సెంటిమెంట్ మనసుల్ని హత్తుకుంటుంది. విజయ్ మిల్టన్ వద్ద గోలీసోడా, కడుగు, టెన్ చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన బాలమురుగన్ వినూత్నమైన కథాంశంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో పాటల్ని విడుదలచేసి ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. సంపత్రాజ్, జియాశర్మ, నోయల్, శాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అరల్ కొరెళ్లి, సాహిత్యం: చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ట, రోల్ రైడా, విశ్వ, స్వామి.