హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికగా గుర్తింపును తెచ్చుకుంది శ్రద్ధాకపూర్. ప్రస్తుతం ఆమె ప్రసిద్ధ మరాఠీ నృత్యకారిణి, తమాషా కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘ఈథ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదలకానుంది. ఇదిలావుండగా ఈ సినిమాకు శ్రద్ధాకపూర్ దాదాపు 15కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నదని తెలిసింది.
రెండేళ్ల క్రితం చేసిన ‘స్త్రీ-2’ చిత్రం కోసం ఆమె కేవలం ఐదుకోట్ల పారితోషికాన్ని మాత్రమే తీసుకుందట. అయితే ‘ఈథ’ సినిమాలో పాత్రపరమైన సవాళ్లతో పాటు దాదాపు ఏడాది పాటు డేట్స్ కేటాయించాల్సి రావడంతో నిర్మాతలు ఆమెకు 15 కోట్ల భారీ మొత్తాన్ని అందించారని చెబుతున్నారు.