రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమాలోని రెండో గీతం ‘వీడు..’ విడుదలైంది. హీరో స్వభావాన్ని ఆవిష్కరిస్తూ మాస్ అంశాలతో ఈ పాట ఆకట్టుకుంది.
‘అందరు ఆగిన చోట మొదలవుతాడు వీడు. ఎదగడమే జన్మ హక్కంటాడు వీడు’ అంటూ సాగిన ఈ గీతాన్ని జీవీ ప్రకాష్కుమార్ స్వరపరిచారు. చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, విజువల్స్ బిగ్స్క్రీన్పై కొత్త అనుభూతిని పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. నూపూర్ ససన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ.