మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్గ్లింప్స్తో పాటు ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. దీంతో రెండో గీతంపై ఆసక్తినెలకొంది. ఈ పాటను సోమవారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. ఇదిలా వుండగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం కేరళలోని సుందరమైన లొకేషన్లలో ఓ రొమాంటిక్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ అనంతరం చిత్రబృందం హైదరాబాద్లో మరో కీలక షెడ్యూల్కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, జగపతిబాబు, జయరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.