Salaar | బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రభాస్. వరుసగా సినిమాలు సైన్ చేశాడు.. ఇప్పుడు అవి వరసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి కూడా. ఈ క్రమంలోనే ఇటీవల రాధే శ్యామ్ విడుదలైంది. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు మొత్తం కోరుకునేది ఒక్కటే. ఆయన పక్కా కమర్షియల్ సినిమాతో రావాలి.. అలా వచ్చిన సినిమాతో థియేటర్లో పండగ చేసుకోవాలి.. ఇదే ప్రస్తుతం ప్రభాస్ నుంచి అభిమానులు కోరుకునేది. వాళ్ల ఎదురు చూపులకు సలార్ సినిమా తెర దించుతుందని చాలా రోజులుగా వేచి చూస్తున్నారు.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. 2022 లోనే ఈ సినిమా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ముందు ఏప్రిల్ 14, 2022న ఈ సినిమా విడుదల చేయాలి అనుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ చాలా రోజులు ఆలస్యమైంది. దాంతో అదే రోజు కేజీఎఫ్ 2 విడుదల చేస్తున్నారు. సమ్మర్ మిస్ అయితే అయిపోయింది.. దసరాకు వస్తుందేమో అనుకుంటే ఇప్పుడు అది కూడా జరగడం లేదు. అసలు 2022లో సలార్ సినిమా రావడం కష్టమే. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఒక షాక్.
దసరాకు కుదరకపోతే సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకుంటే ఆ టైమ్లో ఆదిపురుష్ సినిమా వస్తుంది. దీంతో సలార్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాను ఒకటి కాదు రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఈయన.. మరో రెండు నెలల వరకూ ప్రభాస్ సినిమా వైపు చూడటం కష్టమే. ఈ గ్యాప్లో ప్రభాస్ కూడా మిగిలిన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. తాజాగా ఆయన మారుతి సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. మొత్తానికి సలార్ ఈ ఏడాది రాదని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ మళ్లీ పెరగాలంటే అలాంటి మాస్ మసాలా సినిమా ఒకటి కావాలి.. కానీ అది రావడానికి మరింత ఆలస్యం అవుతుంది అని తెలిసిన తర్వాత అభిమానులకు షాక్ తప్ప మరొకటి లేదు.
“Radhe Shyam | అనుకున్న తేదీ కంటే ముందే ఓటీటీలోకి ‘రాధేశ్యామ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?”
రాధే శ్యామ్ సినిమాకు నిజంగా ఇది కలలో కూడా ఊహించని దెబ్బ..!”
Bahubali Part-3 | రాజమౌళి నుంచి బిగ్ అప్డేట్.. ‘బాహుబలి-3’ ఖచ్చితంగా ఉంటుందని వెల్లడి”