Radhe Shyam Movie on OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కనీస స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్ను తెరపై చూడబోతున్నాం అనే ఉత్సాహంతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం కలెక్షన్లు బాగానే ఉన్న వీక్ డేస్లో మాత్రం భారీగా డ్రాప్స్ కనిపించాయి. దానికి తోడు పరభాష చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈ చిత్రానికి గట్టి పోటీనిస్తుంది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తొలిగించి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శితం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
‘రాధేశ్యామ్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ భారీ ధరకు విక్రయించింది. మొదట అనుకున్న డీల్ ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని రాధేశ్యామ్ మేకర్స్ డీల్ కుదిరించుకున్నారు. అయితే తాజాగా అమేజాన్ ప్రైమ్ నిర్వాహకులు యూవీ క్రియేషన్స్ను సంప్రదించి మొదట అనుకున్న తేదీ కంటే ముందుగానే రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేసుకునే విధంగా డీల్ను జరుపుతున్నారట. ఇప్పుడున్న పరిస్థుతుల్లో రాధేశ్యామ్ నష్టాల్లో కొంచెం భారమైన తగ్గుతుందని, అంతేకాకుండా మరో పదిరోజుల్లో ట్రిపుల్ ఆర్ విడుదల కానుంది. ఇక ఆ తర్వాత ఈ చిత్రం ముందుకు సాగడం కష్టమేనని భావించి యూవీ క్రియేషన్స్ ఈ డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో అమేజాన్ ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.