తన కథను కాపీకొట్టి దర్శకుడు సాయిరాజేష్ ‘బేబీ’ సినిమా తీశాడని, ఆయన చేసిన మోసం..దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చానని చెప్పారు శిరిన్ శ్రీరామ్. ఆయన దర్శకత్వం వహించిన ‘ప్రేమించొద్దు’ చిత్రం జూన్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘బేబీ’ సినిమా విషయంలో తనను సాయిరాజేష్ మోసం చేశాడని శిరిన్ శ్రీరామ్ ఆరోపించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఫేస్బుక్లో చూసిన ఓ పోస్ట్ ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఆదే సమయంలో నిర్మాత సాయిరాజేష్తో ఏడాది పాటు ప్రయాణం చేశాను.
నాకు దర్శకుడిగా అవకాశమిస్తూ తనే నిర్మాతగా సినిమా తీస్తానని సాయిరాజేష్ నాతో చెప్పాడు. సినిమా ఆలస్యం అవుతుందని అనిపించడంతో నేను బయటకు వచ్చేశాను. అదే కథను కాపీ కొట్టి ‘బేబీ’ తీశాడు. సినిమా రిలీజ్ సమయంలో నేను ఎలాంటి గొడవ చేయలేదు. నిజాలు తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది. సాక్ష్యాలను సేకరించి కాపీరైట్ లీగల్ నోటీసులు పంపాం. కానీ నాకే ఆయన ఈ కథ చెప్పాడని నోటీసులకు రిైప్లె ఇచ్చారు. ఈ విషయంపై ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు పెట్టాను. సాయిరాజేష్ మీద రాసిన ‘బేబీ’ లీక్స్ పుస్తకాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా’ అన్నారు.