Shilpa Shetty | సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఒకరు శిల్పాశెట్టి ఒకరు. ఎప్పటికప్పుడు తన చిత్రాల సంబంధించిన అప్డేట్స్, యోగా సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఫొటోషూట్లను షేర్ చేస్తుంటుంది. అయితే, ఈ బాలీవుడ్ బ్యూటీ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలం వరకు తను సామాజిక మాధ్యమాల్లో కనిపించనని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిందనీ, ఈ మేరకు శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పూర్తి బ్లాక్ ఫొటోను షేర్ చేసింది.
‘ఎలాంటి కొత్తదనం లేదు. అంతా ఒకేలా కనిపిస్తోంది. చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటా’ అని పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు షాక్కు గురయ్యారు. శిల్పా ఇటీవలే ఓటీటీలో అరంగ్రటం చేసి అందరి దృష్టి ఆకర్షించింది. రోహిత్ శెట్టి హై ఆక్టేన్ ఓటీటీ సిరిస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’లో నటించింది. శిల్పాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం, ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.