D51 | హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. త్వరలో ఆయన ధనుష్తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గురువారం ధనుష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు.
ఓ వైపు ఆకాశ హర్మ్యాలు, మరోవైపు మురికి వాడాలు…వాటి మధ్యలో నోట్ల కట్టలతో ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. సమకాలీన సమాజంలోని ఆర్థిక అంతరాలను చర్చించే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని కాన్సెప్ట్ పోస్టర్ను చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.