‘బలగం’ సినిమాతో పదికాలాలు గుర్తిండిపోయే గొప్ప విజయాన్ని అందుకున్నారు నటుడు, దర్శకుడు వేణు యెల్దండి. తన నెక్ట్స్ సినిమాగా ఆయన ‘ఎల్లమ్మ’ని ప్రకటించడంతో షూటింగ్ ప్రారంభించకముందే సినిమా చర్చనీయాంశమైంది. ఇందులో హీరోగా నితిన్ నటించనున్నట్టు ఎనాడో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం లెక్కలు మారినట్టు తెలుస్తున్నది.
ఈ సినిమా బడ్జెట్ 70కోట్లకు తేలడంతో మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా స్టార్తో వెళ్లాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ఇందులో భాగంగా తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ ఉన్న హీరో కార్తీని సంప్రదించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో కథానాయిక ‘ఎల్లమ్మ’ పాత్రకు సాయిపల్లవి, కీర్తిసురేశ్ ఇద్దరిలో ఒకర్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.