1960 దశకంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో తాజా షెడ్యూల్ మొదలైంది. రంపచోడవరం అడవుల్లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనే ట్యాగ్లైన్తో రానున్న ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్నంది.