శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్నిచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని, శర్వానంద్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్, సంగీతం: యువన్శంకర్ రాజా, ఆర్ట్: విఠల్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కృష్ణచైతన్య.