యువ హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రక్షితతో ఆయన పెండ్లి రాజస్థాన్ జైపూర్లోని లీలా ప్యాలెస్లో శనివారం రాత్రి 11 గంటలకు ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి వీరి పెండ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఉదయం హల్దీ వేడుక, సాయంత్రం సంగీత్ కార్యక్రమాలు జరిగాయి.
రామ్చరణ్, సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షిత తదితరులు వివాహానికి హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 9న హైదరాబాద్లో శర్వానంద్, రక్షిత రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నది. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన కొత్త చిత్రంలో నటిస్తున్నారు.