శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలైంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నిర్ధేకత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్స్ను నిర్మించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. 1960 ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే ఈ కథ ఇంటెన్స్ ఎమోషన్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఆకట్టుకుంటుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ కుమార్ ఆరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: కేకే రాధామోహన్.