యష్రాజ్ ఫిలింస్ బ్లాక్బస్టర్ ‘వార్’కి సీక్వెల్గా ‘వార్ -2’ రానున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతున్నది. ఆయాన్ ముఖర్జీ దర్శకుడు. హృతిక్ రోషన్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలావుంటే, పార్ట్ వన్లో హృతిక్ని ఢీకొనే పాత్రను టైగర్ ష్రాఫ్ చేస్తే, ఈ రెండో పార్ట్లో ఆ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు.
ఇందులో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తిమంతంగా దర్శకుడు డిజైన్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జనవరి నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. విరామం లేకుండా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్లోనే ఎన్టీఆర్ ఉంటారు. అంతేకాదు ఇందులో ఆయన సరసన హీరోయిన్ని కూడా దర్శకుడు ఖరారు చేశారు.
‘బంటీ ఔర్ బబ్లీ -2’తో వెండితెరకు పరిచయమై, డెబ్యూ ఆఫ్ ది ఇయర్గా ఐఫా అవార్డు సొంతం చేసుకున్న శార్వరీ వాఘ్ని ఎన్టీయార్కి జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేకాదు, ప్రత్యేక పాత్రల్లో దీపికా పడుకోన్, అలియాభట్ కూడా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ పాన్ ఇండియా యుగంలో దక్షిణాది నుంచి తారక్నీ, ఉత్తరాది నుంచి హృతిక్నీ కలిపి యష్రాజ్ ఫిలింస్ బాక్సాఫీస్పై చేస్తున్న ఈ ‘వార్ ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.