చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్లుక్తో పాటు మోషన్ పోస్టర్ను ఇటీవల ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కుటుంబ విలువలను అద్భుతంగా ఆవిష్కరించారు.
తెలంగాణ మట్టి పరిమళాలు కలబోసుకున్న కథ ఇది. కుటుంబ విలువలు, సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పే ఈ తరహా చిత్రాలను మనందరం ప్రోత్సహించాలి’ అన్నారు. మధ్య తరగతి కుటుంబాల్లోని సమస్యలను కళ్లకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.
దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ ‘సమాజానికి మంచి సందేశాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. త్వరలో విడుదల చేస్తాం. గురూజీ త్రివిక్రమ్గారు ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంగీతం: అరుణ్ చిలివేరు, మాటలు: పెద్దింటి అశోక్కుమార్, నిర్మాతలు: నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, డా॥ కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన-దర్శకత్వం: కుమారస్వామి (అక్షర).