హిందీ చిత్రసీమలో వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సత్తా చాటుతున్నది అగ్ర కథానాయిక తాప్సీ. ముఖ్యంగా మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్ద పీట వేస్తున్నది. ఈ భామ షారుఖ్ఖాన్తో కలిసి ‘డంకీ’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. రాజ్కుమార్ హీరానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుంది. తన కెరీర్లోనే అత్యుత్తమ అవకాశం ఇదని తాప్సీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘షారుఖ్ఖాన్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసినా చాలనుకునేదాన్ని. అలాంటిది నాయికగా అవకాశం వరించింది.
రాజ్కుమార్ హీరానీ చిత్రాలు వినోదం, సందేశం కలబోసి ఉంటాయి. ఇండస్ట్రీలోని ఇద్దరు ఉత్తమ ప్రతిభావంతులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఓ నటికి ఇంతకుమించి ఏం కావాలి? అని పేర్కొంది. పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లే అక్రమ వలసదారుల నేపథ్య కథతో దర్శకుడు రాజ్కుమార్ హీరానీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వచ్చే డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది.