షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్ ఫర్జి. రాశీఖన్నా , కేకే మీనన్, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్రా, భువన్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ ప్రాజెక్ట్ ట్రైలర్ (Farzi Trailer)ను మేకర్స్ లాంఛ్ చేశారు. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఫర్జి ఫిబ్రవరి 10న విడుదల కానుంది.
షాహిద్కపూర్ డబ్బు పరచబడి ఉన్న బెడ్పై జంప్ చేస్తున్న విజువల్స్ తో ట్రైలర్ షురూ అయింది. మనం మిడిల్ క్లాస్ కాదు.. మిడిల్ ఫింగర్ క్లాస్ అని.. తాను ఏ కళనైనా ప్రదర్శించగలిగే కళాకారుడినని అంటున్నాడు షాహిద్కపూర్. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని షాహిద్ కపూర్ టీంనకిలీ నోట్లను తయారు చేయాలని ఫిక్సవుతుంది.
నకిలీ నోట్లను తయారు చేసే క్రమంలో విజయ్ సేతుపతి టీం షాహిద్కపూర్ గ్యాంగ్ను వెంబడిస్తోంది. ఇద్దరి మధ్య సాగే పోటాపోటీ ఫైట్లో ఎవరు విన్నర్ అనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. D2R Films బ్యానర్పై నిర్మి్స్తోన్న ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఫర్జి ట్రైలర్..
after this point, we don't know con real hai & con Farzi 🤯#Farzi #FarziOnPrime, Feb 10 pic.twitter.com/AijbYNPd2A
— prime video IN (@PrimeVideoIN) January 13, 2023