బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ‘పఠాన్’ చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది. స్పై థ్రిల్లర్గా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం షారుఖ్ఖాన్ తొలుత ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదు. అయితే విడుదల అనంతరం లాభాల్లో కొంత వాటాను పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట. దాని ప్రకారం షారుఖ్ఖాన్ దాదాపు 200కోట్ల వరకు రెమ్యునరేషన్ను అందుకున్నారని బాలీవుడ్ పత్రికల్లో కథనాలొచ్చాయి. భారతీయ సినిమా చరిత్రలో ఓ హీరో అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.