హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ B.E. సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి మార్చి/ఏప్రిల్ 2021లోనే పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా కొవిడ్-19 సంక్షోభంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
II, IV సెమిస్టర్ (బ్యాక్లాగ్), III సెమిస్టర్ (మెయిన్ , బ్యాక్లాగ్), V సెమిస్టర్ (మెయిన్), సీబీసీఎస్- I, II, III, IV, V, VI (బ్యాక్లాగ్); నాన్-సీబీసీఎస్- ఫస్టియర్, II / I, II / II, III / I, III / II (బ్యాక్ లాగ్) పరీక్షలు జూలై 5 నుండి జరుగనున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైం టేబుల్ కోసం https://www.osmania.ac.in వెబ్సైట్కి లాగినై తెలుసుకోవచ్చన్నారు. కాగా ఇంతకుముందు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో జారీ చేసిన హాల్టికెట్లను తీసుకురావాల్సిందిగా వర్సిటీ తెలిపింది.