SeshE X Shruti | థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు టాలీవుడ్ యువ హీరో అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఒక డెఫినేషన్లా మారిపోయాడు. అలాంటి సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు సైతం ముందుగా అప్రోచ్ అయ్యేది అడివిశేష్నే. నిజానికి హీరోగా ఆయన నిలబడడానికి ముఖ్య కారణం కూడా థ్రిల్లర్ జానర్ సినిమాలు చేయడం వల్లనే. మాములుగా ఈ జానర్లో సినిమాలు చేయాలంటే హీరోలు భయపడుతుంటారు. ఎందుకంటే కథనంలో కాస్త పట్టు తప్పినా సినిమా రిజల్ట్ ఊహించని విధంగా డిజాస్టర్ అవుతుంది. అయితే అడివి శేష్ తానే స్వయంగా టైట్ స్క్రీన్ప్లేను రాసుకోవడంతో సినిమాలు ఆడుతున్నాయి. ఇక రీసెంట్గా అచ్చోచ్చిన జానర్లో గూడాఛారి-2 కూడా స్టార్ట్ చేశాడు.
అయితే ఈ సినిమా పట్టాలమీద ఉండగానే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు అడివి శేష్. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా షనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అడివి శేష్ కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్ను డిసెంబర్ 18న అనౌన్స్ చేయనున్నట్లు తెలిపాడు. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్ను పంచుకున్నాడు. ఈ పోస్టర్లో శేష్ ఎక్స్ శ్రుతి అని ఉంది.
Surprise! ❤️🔥 #SeshEXShruti
Not just a straight Bollywood Film. Not just a straight TFI film. This is an ALL INDIAN film 🔥
Title will be revealed on Dec 18@Deonidas @AnnapurnaStdios #SupriyaYarlagadda @AsianSuniel #SSCreations pic.twitter.com/7ASCsnuNpK
— Adivi Sesh (@AdiviSesh) December 14, 2023
ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించనుండగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
మరోవైపు.. అడివి శేష్ ప్రస్తుతం ‘జీ 2’ (Goodachari 2) షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘జీ 2’ తెరకెక్కుతోంది. ఇందులో శేష్ సరసన బాలీవుడ్ బనితా సంధు నటించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.