రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. దేవేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డా॥రాజీవ్, డా॥ రోజా భారతి నిర్మాతలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, ఓ జంట ప్రేమప్రయాణంలోని అనుభూతులకు అద్దంపడుతుందని దర్శకుడు తెలిపారు. నేటి యువతను ఆకట్టుకునే లవ్స్టోరీ ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవీంద్ర, సంగీతం: శరవణ వాసుదేవన్, దర్శకత్వం: దేవేందర్.