స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘మన రాజ్యాంగం, చట్టం చాలా గొప్పది. కానీ బలహీనులు బాధితులుగా మిగిలిపోతున్నారు.
చట్టం నిజంగా ఎలా పని చేయాలో ఈ సినిమాలో చూపించాం. నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తిపొంది ఈ కథ రాసుకున్నా. సమాజంలోని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేలా ఉంటుంది’ అన్నారు. రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బాబు నిమ్మగడ్డ.