హాస్యనటుడు సత్యం రాజేష్ హీరోగా, సునీత హీరోయిన్గా నటించనున్న నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు.
ఈ సంద ర్భం గా దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభిం చాం. వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. సత్యం రాజేష్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు. సప్తగిరి శ్రీనివాస్రెడ్డి, మధునందన్, చమ్మక్చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాల్రెడ్డి, సంగీతం: భీమ్స్.