ఇటీవల మహేష్బాబు జన్మదినం సందర్భంగా బర్త్డే బ్లాస్టర్ పేరుతో ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టీజర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్బాబు సరికొత్త లుక్తో ఆకట్టుకున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్లో రామ్లక్ష్మణ్ నిర్దేశకత్వంలో పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. గోవా షెడ్యూల్ వర్కింగ్ స్టిల్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫొటోలో మహేష్బాబు, దర్శకుడు పరశురామ్, ఫైట్మాస్టర్స్స్ రామ్లక్ష్మణ్ సన్నివేశం గురించి చర్చిస్తూ కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయబోతున్నారు.