మహేశ్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కెరీర్లో తొలిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో పని చేస్తున్నాడు పరశురామ్. ఈ మధ్యే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్లో రికార్డులు తిరగరాసింది. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో లోన్ రికవరీ ఆఫీసర్గా నటిస్తున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఒక కాలనీలో గత 15 రోజులుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు పరశురామ్.
అయితే రెండు వారాలుగా కేవలం రెండు సన్నివేశాలు కూడా వర్కవుట్ కాలేదని.. షూటింగ్ అనుకున్న దానికంటే చాలా నెమ్మదిగా సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య దుబాయ్ వెళ్లి అక్కడ 43 రోజులు షూటింగ్ చేసి వచ్చారు సర్కారు వారి పాట టీం. అక్కడ కూడా ఊహించిన దానికంటే తక్కువ సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ విషయంలో మహేశ్ బాబు కాస్త అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న ఈ తరుణంలో.. సర్కారు వారి పాట సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మహే శ్ బాబు.
ఇదే విషయాన్ని దర్శకుడు పరశురామ్ కు కూడా చెప్పాడు మహే శ్ . కానీ వాళ్లు ప్లాన్ చేసుకున్నంత వేగంగా సర్కారు వారి పాట ముందుకు వెళ్లడం లేదు అంటూ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం. సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లో అంటే.. డిసెంబర్ లోపు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు మహేశ్ బాబు. డిసెంబర్లో త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. సర్కార్ వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, మహేశ్ బాబు సొంత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss: పండగ రోజు చల్లారని మంట..!
Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్గా మారిన ఫొటోలు
Chiranjeevi: మెగాస్టార్ ఇంటి వినాయకుడిని చూశారా..!
Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్